ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. కరోనా వైరస్ కట్టడి కోసం మార్చి 24న రాత్రి ప్రకటించిన దేశ వ్యాప్త లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడుతారనే దానిపై దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. గతంలో ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ వల్ల చాలా వరకు వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయగలిగినప్పటికీ ఢిల్లీ ఘటనతో ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ ప్రభావం ఇంకా పలు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్లి వచ్చిన వాళ్లు, వారితో కాంటాక్ట్ అయిన వారికి సంబంధించిన కేసులు ఇంకా నమోదువుతూనే ఉన్నాయి. వీటిని పూర్తిగా కంట్రోల్ లోకి తెచ్చేందుకు లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండ్రోజుల క్రితం ప్రధాని మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కోరారు. ఇప్పటికే పంజాబ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగింపుపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు కూడా చేశాయి. దీనికే ప్రధాని మోడీ కూడా మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తొలి లాక్ డౌన్ లాగా పూర్తిగా అన్ని కార్యకలాపాలను మూసేయడం కాకుండా కొంత మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం.
ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి మోడీ ప్రసంగం.. లాక్ డౌన్ పై ప్రకటన!
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]