ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లా కేంద్రం లోని రిమ్స్ ఆవరణలో కొనసాగుతున్న కుష్టు వ్యాధి గ్రస్థుల వార్డు (టీహెచ్డబ్ల్యూ)ను ఓపీ ప్రాంగణం లోని పీపీ యూనిట్ పక్కకు తరలించారు. నూతన వార్డును శుక్రవారం నాడు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బలిరాం, ఆర్ఎంవో శోభాపవార్, ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారులు డా.నరేందర్ రాథోడ్, డా.ధన్రాజ్లు ప్రారంభించారు.పాత భవనం శిదిలవస్తకు చేరడంతో కొత్త భవనానికి మార్చడం జరిగింది. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్, , ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారులు మాట్లాడుతూ ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరినందున పీపీ యూనిట్ సమీపంలోకి లెప్రసీ వార్డును తరలించామన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో రూం నెంబర్ 18 ని కేటా యించామని తెలిపారు. ఇకనుంచి కుష్టి వ్యాధికి సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు ఈ వార్డులోని అందుతాయని ఈ సందర్భంగా వారు సూచించారు ఈ మార్పును కుష్టు వ్యాధిగ్రస్థులు, ప్రజలు గమనించాలని కోరారు. అనంతరం నూతన వాడు ప్రారంభోత్సవానికి వచ్చిన హాజరైన నాడు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బలిరాం, ఆర్ఎంవో శోభాపవార్, ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారులు డా.నరేందర్ రాథోడ్, డా.ధన్రాజ్లను కుష్టు విభాగం తరపున సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కుష్టు నివారణ అధికారి డా.శ్రీకాంత్, డీపీఎంవోలు వామన్రావ్, మధు సూదన్, వైద్యుడు విక్రమ్, సిబ్బంది రమణాచారి, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. నూతన వార్డును

కుష్టు వ్యాధి చికిత్స నూతన వార్డు ప్రారంభం
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]