న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్ నుంచే కరోనా వ్యాప్తి పెరిగింది. ఆయా రాష్ర్టాల్లో కొత్తగా వెలుగు చూసిన పాజిటివ్ కేసుల్లో ఎక్కువ మంది మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారే ఉంటున్నారు. ఇప్పటి వరకు 6000 మందిని గుర్తించారు. మరో 2 వేల మంది కోసం గాలిస్తున్నారు. భారత్లో ఇవాళ్టి ఉదయం వరకు 2027 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 62 మంది ప్రాణాలు కోల్పోయారు. 169 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 335, కేరళలో 265 కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో 234, ఢిల్లీలో 152, రాజస్థాన్లో 120, ఉత్తరప్రదేశ్లో 177, ఆంధ్రప్రదేశ్లో 111, కర్ణాటకలో 110, తెలంగాణలో 97, గుజరాత్లో 87, మధ్యప్రదేశ్లో 86, జమ్మూకశ్మీర్లో 62, పంజాబ్లో 46, హర్యానాలో 43, పశ్చిమ బెంగాల్లో 37, బీహార్లో 24, చండీఘర్లో 17, అసోంలో 13, లడఖ్లో 13, అండమాన్ నికోబార్ దీవుల్లో 10, ఛత్తీస్గఢ్లో 9, ఉత్తరాఖండ్లో 7, గోవాలో 5, ఒడిశాలో 5, హిమాచల్ప్రదేశ్లో 3, పుదుచ్చేరిలో 3, జార్ఖండ్, మణిపూర్, మిజోరంలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి.