– వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
– 200 కోట్లతో వైద్య ఉద్యోగుల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి : TMPH JAC
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): ప్రాణాలకు తెగిం చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న వైద్యులకు ప్రభు త్వం అండగా ఉంటుందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. గురువారం బీఆర్కే భవన్లో వైద్యులు, పారామెడికల్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, తెలంగాణ పబ్లిక్ హెల్త్ వైద్యుల సంఘం మరియు తెలంగాణ మెడికల్ & పబ్లిక్ హెల్త్ JAC అధ్వర్యంలోఇతర సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వైద్య సంఘాల నేతలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వాటిని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైద్యులు, పారామెడికల్ ఇతర సిబ్బందికి, కుటుంబసభ్యులకు నిమ్స్, టిమ్స్, గాంధీ దవాఖానల్లో ప్రత్యేక చికిత్స అందిస్తామని చెప్పారు. నిమ్స్లో 50 పడకలు ఏర్పాటుచేస్తామని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అందరికీ అక్కడే చికిత్స అందించేలా చూస్తామని స్పష్టంచేశారు. కరోనా చికిత్స అందిస్తూ చనిపోయిన వైద్యసిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి సీఎం కేసీఆర్కు విన్నవిస్తానని పేర్కొన్నారు. సమావేశంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, తెలంగాణ వైద్య సంఘాల నేతలు రవిశంకర్, కత్తి జనార్దన్, శేరిఫ్, పుట్ల శ్రీనివాస్, బొంగు మహేశ్, నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు సుజాత, హేమలత తదితరులు పాల్గొన్నారు.
200 కోట్లతో వైద్య ఉద్యోగుల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి : TMPH JAC
వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వైద్యులు మరియు వైద్య సిబ్బంది విధి నిర్వహణలో ఏదైనా జరిగితే ప్రాణాలు కోల్పోతే తక్షణమే ఆదుకోవడం కోసం ప్రభుత్వం 200 కోట్లతో ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కోరడం జరిగిందని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, తెలంగాణ పబ్లిక్ హెల్త్ వైద్యుల సంఘం మరియు తెలంగాణ మెడికల్ & పబ్లిక్ హెల్త్ JAC అధ్వర్యంలోవైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్కి వినతి పత్రాన్ని సమర్పిచారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం మరియు చైర్మన్ తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ జెఎసి డాక్టర్ రవి శంకర్. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ షరీఫ్ ,తెలంగాణ ప్రజారోగ్య వైద్యుల సంఘం వర్కింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ జనార్ధన్, టి పి హెచ్ డి ఏ. టి ఎన్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అభిరామ్, టిడిపి హెచ్ డి ఎ కో కన్వీనర్ టి ఎన్ పి డాక్టర్ ప్రవీణ్ లు అన్నారు. ప్రస్తుత సమాజంలో రకరకాల జబ్బులు వస్తున్నాయని వాటిని నయం చేయడంలో వైద్యులు వైద్య ఆరోగ్య సిబ్బంది ఎంతగానో కృషి చేస్తుందని విధినిర్వహణలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఇటీవల వచ్చిన కరోనా వల్ల చాలామంది వైద్య ఆరోగ్య సిబ్బంది చనిపోయారని వారి కుటుంబాన్ని ఆదుకోలేక పోయామని అందుకే ప్రభుత్వం కార్పస్ పండును ఏర్పాటు చేసి మెడికల్ పారామెడికల్ సిబ్బందిని ఆదుకోవాలని ఆయన కోరారు. కరోన వల్ల వైద్య ఉద్యోగులందరూ ఎంతగానో కష్టపడుతున్నారని ఈ సందర్భంగావారు తెలిపారు